తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. కాకినాడ జిల్లా రూరల్ మండలానికి చెందిన పొలవరపు సాయి(12) యేలేరు కాలవలో పడి మరణించారు. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలానికి చెందిన జి.వీరవేణి ఇంటి ముందు తాటిచెట్టు పడి మరణించారు. కృష్ణా జిల్లాలో కృత్తివేన్ను మండలానికి చెందిన కోయ సుబ్బారావు(60) కొబ్బరిచెట్టు పడి మరణించారు.నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలానికి చెందిన కృష్ణమనేని జయమ్మ(60) పశువులు మేపి ఇంటికి తిరిగి వస్తూ పొట్టేలు వాగులో కొట్టుకుపోయి మరణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన ఎస్.లావణ్య వలహగడ్డ వాగులో పడి మరణించారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మర్రెడ్డి రాములమ్మ(90) బుధవారం ఉదయం ఇంట్లో పాత మిద్దె కూలి మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కౌండ్రగుంట సీతమ్మ(49) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఉదయానికి సీతమ్మ మరణించారు. విద్యుదాఘాతంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా, అధికారులు మాత్రం గుండెపోటుతో మరణించి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa