ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటకంలో ఒక రాష్ట్రము మరో రాష్ట్రాన్ని పొగడటం ఏంటి?

national |  Suryaa Desk  | Published : Thu, Oct 30, 2025, 04:51 PM

కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పొరుగు రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ను ప్రమోట్ చేస్తూ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుర్చీని కాపాడుకునేందుకు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ పని చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.వివరాల్లోకి వెళితే... ఈనెల 28న కేఎస్‌టీడీసీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వయనాడ్ పర్యటనకు సంబంధించి రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీని ప్రకటించింది. "ఉత్సాహం కావాలా? ప్రశాంతత కోరుకుంటున్నారా? రెండూ వయనాడ్‌లో పొందండి! అందమైన ట్రెక్కింగ్, జలపాతాలు, వన్యప్రాణులను కేఎస్‌టీడీసీతో కలిసి ఆస్వాదించండి. ప్రకృతిలో మీ అద్భుతమైన విహారం వేచి ఉంది" అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెలువడిన వెంటనే బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శల దాడిని ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa