ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ సమగ్రతకు మార్గదర్శకుడు వల్లభాయ్ పటేల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 12:45 PM

భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఘన నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ‘భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన మహానీయ దార్శనికుడు... ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి... దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa