ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్‌లో ఒకరిని వరించిన రూ.11 కోట్ల బంపర్ లాటరీ

national |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 04:52 PM

పంజాబ్‌లో ఒక అదృష్టవంతుడిని దీపావళి బంపర్ లాటరీ వరించింది. ఏకంగా రూ.11 కోట్ల జాక్‌పాట్ తగలడంతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అయితే, ఆ విజేత ఎవరనేది మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. పంజాబ్ ప్రభుత్వం లాటరీ ఫలితాలు ప్రకటించినా, విజేత ఇంకా బయటకు రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.భఠిండాలోని రతన్ లాటరీ కేంద్రంలో ఈ టికెట్‌ను విక్రయించారు. ఈ సందర్భంగా లాటరీ కేంద్రం నిర్వాహకుడు ఉమేశ్ మాట్లాడుతూ.. తన వద్ద టికెట్లు కొనేవారిలో దాదాపు 40 శాతం మంది తమ వివరాలు వెల్లడించరని, ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకుంటారని తెలిపారు. తాను గత 35-40 ఏళ్లుగా లాటరీలు అమ్ముతున్నానని, తన దుకాణంలో టికెట్లు కొని 40 మందికి పైగా కోటీశ్వరులయ్యారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.లాటరీ నిబంధనల ప్రకారం.. విజేత 25 రోజుల్లోగా తమ టికెట్‌తో వచ్చి నగదును క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఎవరూ రాకపోతే, ఆ మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది. గెలుచుకున్న రూ.11 కోట్లలో పన్నులు పోనూ, విజేత చేతికి సుమారు రూ.7.7 కోట్లు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa