కేరళ, పంజాబ్లో ప్రభుత్వాలే లాటరీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో బంపర్ లాటరీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన లాటరీ ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అక్టోబరు 31న నిర్వహించిన బంపర్ డ్రాలో అతడికి ఏకంగా రూ.11 కోట్ల లాటరీ తగిలింది. బఠిండాలోని లాటరీ ఏజెంట్ నుంచి కొనుగోలు చేసిన టిక్కెట్కు లాటరీ వరించింది. ఆదాయపు, మిగతా పన్నులు మినహాయిస్తే విజేతకు రూ.7.7 కోట్లు చేతికి అందుతాయి. కానీ, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు ఆ వ్యక్తి మాత్రం రాకవపోడం గమనార్హం.
విజేతగా నిలిచిన వ్యక్తి ఇంత వరకూ తమను సంప్రదించలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ లాటరీ నిబంధనల ప్రకారం 25 రోజులపాటు వేచిచూసి, అతడు రాకుంటే ప్రభుత్వానికి అంది చెందుతుంది. లాటరీ విషయం తెలియగానే చాలా మంది స్వీట్లు పంచుకుని, సంబరాలు చేసుకున్నారు. కానీ, టికెట్ విజేత మాత్రం నిర్వాహకులను కలవలేదు. దీంతో టిక్కెట్ కొన్న వ్యక్తిని గుర్తించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, చాలా మంది తమ వివరాలను ఇవ్వకుండా ఫలితాలను ఆన్లైన్లో చూసుకుంటారని, కాబ్టటి విజేత ఎవరో తెలియడంలేదని చెబుతున్నారు.
రత్న లాటరీ ఏజెన్సీ యజమాని ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీ కోసం తన తాము టిక్కెట్లను విక్రయించామని అన్నారు. బఠిండాలో అమ్ముడైన టికెట్కు రూ.11 కోట్ల బహుమతి వరించింది. విజేత ఇంకా తమను సంప్రదించలేదని, అతడ్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. ఇక, ఈ లాటరీలో మొదటి బహుమతి రూ.11 కోట్లు, రెండో బహుమతి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.కోటి, మూడో బహుమతి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, నాలుగో బహుమతి 9 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, ఐదో బహుమతి 9 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, ఆరో బహుమతి 2,400 మందికి రూ.9 వేలు చొప్పు, ఏడో బహుమతిగా 2,400 మందికి రూ.7 వేలు చొప్పున అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa