ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్ ప్రభావంతో రైతులు నష్టపోతే, నష్టం అంచనాకు క్షేత్రస్ధాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన, తెస్తున్న అప్పంతా ఏమవుతోందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్న బొత్స సత్యనారాయణ, శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa