ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ప్రారంభమైన భూసేకరణ ప్రక్రియ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 03:24 PM

రాజధాని అమరావతికి తలమానికంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణంలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిదశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (3ఏ) విడుదలైంది. త్వరలోనే దీనిని పత్రికల్లో ప్రకటించి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.పల్నాడు జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 17.230 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గెజిట్‌లో స్పష్టం చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే భూముల సర్వే నంబర్లు, యజమానుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 21 రోజుల్లోగా భూసేకరణ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ గెజిట్‌ను పత్రికల్లో ప్రచురించి, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లోనూ కాపీలను అందుబాటులో ఉంచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa