ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో భారత పర్యటన చేయనున్న డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 03:25 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని 'గొప్ప వ్యక్తి' అని, 'తన మిత్రుడు' అని అభివర్ణించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత పర్యటనకు సంబంధించిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ, "ఆయన (మోదీ) నా మిత్రుడు. మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను భారత్‌కు రావాలని ఆయన కోరుకుంటున్నారు. దాని గురించి మేం ఆలోచిస్తాం. నేను తప్పకుండా వెళ్తాను. ఆయన గొప్ప వ్యక్తి," అని అన్నారు. వచ్చే ఏడాది పర్యటన ఉంటుందా అని అడగ్గా, "అవును.. ఉండొచ్చు" అని బదులిచ్చారు. 2020లో తన భారత పర్యటనను గుర్తుచేసుకుంటూ, అది ఒక అద్భుతమైన పర్యటన అని ట్రంప్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa