భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కేరళ రాష్ట్రంలో శబరిమల ఒకటి. అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే వార్షిక మండల పూజ, మకర విలుక్కు పండుగ సమయంలో భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు శబరిమల వెళ్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలల పాటు కొనసాగే ఈ ప్రత్యేక సేవలు.. యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి.
ఈ స్పెషల్ ట్రైన్లు పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మొత్తంగా 20 సర్వీసులు అందించనున్నాయి. 07107 రైలు.. నవంబర్ 17, 24.. డిసెంబర్ 1, 8, 15, 22, 29.. జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 10గంటలకు కొల్లం చేరుకుంటుంది.
ఇక, 07108 రైలు.. నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు చర్లపల్లికి వస్తుంది. మధ్యలో ఈ రైలు పలు స్టేషన్లలో ఆగుతుంది. ఆ వివరాలు రైల్వే చార్ట్లో చూసి తెలుసుకోవచ్చు.
నర్సాపుర్-కొల్లం-నర్సాపుర్ (07105/07106)
ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా 20 సర్వీసులు అందిస్తాయి. 07105 రైలు.. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు నర్సాపూర్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇక, 07106 రైలు నవంబర్లో 18, 25 తేదీల్లో, డిసెంబర్ 2, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ వస్తుంది.
మచిలీపట్నం-కొల్లం-మచిలీపట్నం (07101/07102)
ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా మొత్తం 10 సర్వీసులు అందిస్తాయి. 07101 రైలు నవంబర్లో 14, 21, 28 తేదీల్లో, డిసెంబర్ 26, జనవరి 2 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. మరోవైపు, 07102 నంబరు రైలు నవంబర్లో 16, 23, 30 తేదీల్లో, డిసెంబర్లో 28, జనవరి 4 తేదీల్లో కొల్లంలో తెల్లవారు జామును 2.30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
మచిలీపట్నం-కొల్లం-మచిలీపట్నం (07103/07104)
ఈ రైళ్లు.. గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా 10 సర్వీసులు అందిస్తాయి. 07103 నంబరు రైలు.. డిసెంబర్లో 5, 12, 19 తేదీల్లో, జనవరిలో 9, 16 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 10గంటలకు మచిలీపట్నంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుతుంది. ఇక, 07104 నంబరు రైలు.. డిసెంబర్లో 7, 14, 21 తేదీల్లో, జనవరిలో 11, 18 తేదీల్లో తెల్లవారుజామున 2.30గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 12.30గంటలకు మచిలీపట్నం వస్తుంది. అయితే టికెట్ బుకింగ్ వివరాలు, రైలు సమయాలు వంటి పూర్తి సమాచారం కోసం రైల్వే వెబ్సైట్ను లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను సంప్రదించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa