చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మొంథా తుపాను సహాయక చర్యలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తుపాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి, ప్రజలకు అండగా నిలిచిన మంత్రులను, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అందరి సమష్టి కృషితోనే పెను నష్టాన్ని నివారించగలిగామని ఆయన ప్రశంసించారు.మొంథా తుపాను సమయంలో ప్రతి మంత్రి తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడం వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందాయని సీఎం పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక కార్యక్రమాలు అత్యంత వేగంగా జరిగాయని తెలిపారు. ఈ సమష్టి కృషే మంచి ఫలితాలను ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.అదే సమయంలో టెక్నాలజీ వినియోగంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. ఆర్టీజీ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని వివరించారు. మంత్రులు, అధికారులు ఒక బృందంగా పనిచేయడం తాను ప్రత్యక్షంగా గమనించానని, వారి కష్టానికి అభినందనలు అని చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa