ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జాకి గురైన అటవీ భూముల వివరాలని సేకరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:52 PM

రాష్ట్రంలోని అటవీ ఆస్తులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ భూముల పరిరక్షణ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ భూముల ఆక్రమణల విషయంలో ఎంతటి పలుకుబడి ఉన్నవారినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమించిన వారి పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఎవరి ఆక్రమణలో ఎంత భూమి ఉంది, దానిపై నమోదైన కేసుల వివరాలతో సహా అన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa