ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో చంద్రబాబును ఓడించిన పథకం.. బిహార్‌లో నితీష్‌ను గెలిపించింది

national |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 08:49 PM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ ఛరిష్మా.. నరేంద్ర మోదీ సహా బీజేపీ పెద్దల ప్రచారం, గతేడాది సార్వత్రిక ఎన్నికల నుంచి బిహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు, ప్రాజెక్టులు, పెట్టుబడులు అన్నీ కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను తలకిందులు చేస్తూ.. 200 సీట్లకు పైబడి ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఇక బిహార్ మహిళల్లో నితీష్ కుమార్‌కు ఉన్న ఓట్ బేస్.. ఈ ఎన్నికల్లో ఆయనను విజయతీరాలకు చేర్చాయి. ఇక మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆయన తీసుకువచ్చిన పథకం.. గేమ్ ఛేంజర్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


ఎన్నికలకు ముందు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను అమలు చేశారు. ఇందులో భాగంగా స్వయం ఉపాధి పొందాలనే మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించింది. బిహార్‌లోని 2.7 కోట్ల కుటుంబాల్లో ఉన్న ప్రతీ మహిళకు ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకం కింద దాదాపు 21 లక్షల మంది మహిళలకు వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. కుటుంబంలోని ఒక మహిళకు.. అది కూడా వారు జీవికా దీదీ స్వయం సహాయక బృందాల్లో తప్పనిసరిగా చేరి ఉండాలని షరతులు విధించారు. మహిళలకు ముందుగా రూ.10 వేలు ఇవ్వనున్నారు. 6 నెలల తర్వాత ఆ మహిళలు.. తమ వ్యాపారంలో విజయం సాధించిందని.. రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు.


  ఇక ఇదే ఫార్ములాను గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారు. కుంకుమ పసుపు పథకం కింద.. ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక బృందాల్లో ఉండే మహిళలకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున అందించారు. ఈ పసుపు-కుంకుమ పథకంలో మొత్తం 93,81,118 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. ఆ పథకం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.9381 కోట్లను పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని ప్రకటించడంపై ప్రతిపక్షాలు అప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా.. అమలు చేసేందుకు క్రియరెన్స్ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa