ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న రోజుల్లో ప్రపంచంలో ఆర్థికంగా భారత్ తయారవుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 04:34 PM

భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అద్బుతమైన రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ మనకు రూపొందించి ఇచ్చారని ఉద్ఘాటించారు. ఓ ఛాయ్ వాలాగా ఉన్న నరేంద్రమోదీ ... దేశానికి అత్యుత్తమ ప్రధాని కాగలిగారు అంటే అది మన రాజ్యాంగం గొప్పదనమని అభివర్ణించారు. ఇవాళ(ఆదివారం) గుంటూరు జిల్లాలో జరిగిన భారత రాజ్యాంగ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం అన్నిరంగాల్లో నిపుణులను అందిస్తుందని వివరించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారతదేశం క్రమంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలక బాధ్యత వహిస్తోందని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa