ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏలూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 05:31 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  సోమవారం ఆయన ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు, ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆవిష్కరించారు.ఈ పర్యటనలో భాగంగా, గ్రామం నుంచి సుందరగిరి వరకు నిర్మించనున్న రహదారి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం, ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవలే నిర్మించిన 'మ్యాజిక్ డ్రెయిన్ల' వ్యవస్థను పరిశీలించి, దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa