ఇటీవల వర్షాకాలంలో తిరుపతి పరిధిలోని కలత్తూరులో జరిగిన వరద ఘటనలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి సూచించారు. చెరువు కట్టలను బలోపేతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఎంపీ ఆదేశించారు. ఆ ప్రాంతాల పునరుద్ధరణ కోసం ఎంపీ నిధుల నుంచి రూ.1 కోటి కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. తిరుపతి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం సోమవారం తిరుపతిలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగింది. కమిటీ చైర్మన్గా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ సమావేశానికి హాజరై పలు శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరద నష్టం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక వసతులు, సిఎస్ఆర్ నిధుల వినియోగం, విద్యా రంగ సమస్యలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలలో జరిగిన నష్టానికి సరైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదలో గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయిన దృష్ట్యా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ కింద కొత్త సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఎంపీ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa