టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ముంబై వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ , ప్రస్తుత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాజరయ్యారు. అయిత ఈ సందర్భంగా రోహిత్ శర్మకు ఓ అరుదైన గౌరవం దక్కింది.
2024 టీ20 ప్రపంచ కప్లో భారత్ను విజయపథంలో నడిపించిన రోహిత్ శర్మను.. టీ20 ప్రపంచకప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ జైషా అధికారికంగా ప్రకటించారు. 2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ను ప్రకటించే ముందు, రోహిత్ శర్మ టోర్నమెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని ఐసీసీ ఛైర్మన్ జే షా వెల్లడించారు. కాగా భారత్కు గత టీ20 ప్రపంచకప్ అందించిన తర్వాత రోహిత్ శర్మ.. టీ20లు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
కాగా టీ20 ప్రపంచకప్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ నియామకం సరికొత్త చరిత్రకు నాంది పలికినట్లయింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఈ టోర్నమెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిన మొదటి వ్యక్తిగా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే ఆటగాడికి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు.
టీ20 ప్రపంచకప్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడైన తర్వాత రోహిత్ శర్మ స్పందించాడు. “ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎవరినీ అంబాసిడర్గా నియమించలేదు. గతంలో మాదిరిగానే టీమిండియా ఈసారి కూడా మ్యాజిక్ను సృష్టించాలని ఆశిస్తున్నా. ఐసీసీ ట్రోఫీని గెలవడం సవాల్తో కూడుకున్నది. నేను దానిని స్వయంగా అనుభవించా. నేను క్రికెట్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నా కెరీర్ ప్రారంభంలో రెండు ఐసీసీ టైటిల్స్ గెలుచుకున్నా. ఆ తర్వాత మరో ట్రోఫీని ముద్దాడేందుకు మేమంతా ఎంతగా తహతహలాడామో నాకు తెలుసు” అని రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ 2007, 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్లలో హిట్మ్యాన్.. 44 ఇన్నింగ్స్లలో 1220 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa