హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా ఆకాశాన్నంటాయి. పసిడి కొనాలని చూస్తున్న వారికి మళ్లీ నిరాశ తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ బలహీనతతో పాటు స్థానిక డిమాండ్ కారణంగా ఈ ఒరవడి కొనసాగుతోంది. ఈ రోజు మళ్లీ భారీగా పెరిగిన రేట్లు కొత్త రికార్డులను తాకాయి.
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (10 గ్రాములు) ధర ఒక్క రోజులోనే రూ.870 ఎగసి రూ.1,27,910కి చేరుకుంది. ఇది గత కొద్ది రోజులుగా కనిపిస్తున్న అత్యధిక స్థాయి మార్క్. అత్యంత డిమాండ్ ఉన్న 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) కూడా రూ.800 పెరిగి రూ.1,17,250 వద్ద స్థిరపడింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ ధరల పెరుగుదల మరింత ఒత్తిడి తెస్తోంది.
బంగారంతో పాటు వెండి కూడా దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. ఒక్క కేజీ వెండి ధర రూ.2,000 జంప్ చేసి రూ.1,76,000కి చేరింది. ఇది కూడా గత కొన్ని రోజుల్లో లేని రికార్డు స్థాయి. పారిశ్రామిక డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణ కారణంగా వెండి రేట్లు రాకెట్ స్పీడ్లో పైకి ఎగస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే రేట్లు నమోదవుతున్నాయి. చిన్న చిన్న తేడాలు మినహా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉన్న ఈ ధరలు కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఒరవడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa