మహారాష్ట్రలోని నాసిక్లో శివసేన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గావిత్పై జరిగిన దాడి కలకలం రేపింది. సాయంత్రం తన ఇంటి సమీపంలో మనవడితో కలిసి వాకింగ్ చేస్తున్న ఆమెను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నిర్మలా గావిత్ను వెనుక నుంచి వచ్చిన కారు ఎలాంటి హెచ్చరిక లేకుండా ఢీకొట్టింది. ఆ కారు ఢీకొట్టిన వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి చాలా దూరం పడిపోయారు. ఆమెతో పాటు ఉన్న మనవడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచినా డ్రైవర్ ఇంకా పరారీలోనే ఉండటంపై నిర్మలా గావిత్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ మఝా కథనం ప్రకారం.. ఆమె కుమార్తె నాయనా గావిత్ మాట్లాడుతూ "నాసిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? కఠినమైన నిఘా ఉండే నగరంలో డ్రైవర్ ఇంకా ఎలా దొరకలేదు?" అని ప్రశ్నించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రపూరితంగా చేసినదా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa