ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలకు అందుకే కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించడం లేదు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 02:32 PM

కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోవడం వల్లే కేంద్ర కేబినెట్‌లో వారికి ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన అన్నారు. బుధవారం కోజికోడ్‌ ప్రెస్‌క్లబ్‌ నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తేనే ముస్లిం ఎంపీ ఎన్నికవుతారు. ఎంపీ లేనప్పుడు మంత్రి ఎలా ఉంటారు?" అని ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల ముస్లిం సమాజం ఏం సాధించిందని ఆయన నిలదీశారు. "బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడనప్పుడు, ప్రాతినిధ్యం ఎలా ఆశిస్తారు?" అని అన్నారు.కోజికోడ్‌లో ముస్లింలు బీజేపీకి ఓటేస్తే, ఆ ప్రాంతం నుంచి ఒక ముస్లిం ఎంపీ ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా మంత్రి పదవి కూడా దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజాతీర్పు ద్వారా వస్తుంది కానీ, అదొక హక్కు కాదని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa