2026 ఏప్రిల్ నాటికి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వతహాగా మాయమవ్వడం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలపర్చడానికి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనుంది.ప్రభుత్వం లక్ష్యం, ప్రపంచంలో టాప్ 100 ర్యాంకులలో నిలబడే, ప్రపంచ స్థాయి బ్యాంకులను ఏర్పరచడమే. ఈ క్రమంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మరింత మార్కెట్ విలువను పెంచడానికి ఈ బ్యాంకు ఏకీకరణను మద్దతు ఇస్తోంది.ప్రధాన లక్ష్యాలు: ఫైనాన్షియల్ బుక్స్ సక్రమీకరణ, మొండి బకాయిలు తగ్గింపు, డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మరియు ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని పెంచడం.ప్రస్తుత సమాచారం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ల విలీనం చేయబడే అవకాశం ఉంది. వీటిలో కొన్ని బ్యాంకులు ఒకదానితో మరొకటి విలీనం కావచ్చు లేదా ఇతర పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం కావచ్చు.విలీనం జరిగిన తర్వాత కూడా ఖాతాదారుల ఖాతాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అయితే, కొంతమంది ఖాతాదారులకు ఐఎఫ్ఎస్ కోడ్ మారవచ్చు.1993 నుండి 2025 వరకు భారతదేశంలో బ్యాంక్ విలీనాలు మూడు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. రెండు లేదా ఎక్కువ బ్యాంకుల విలీనం ఒక బలమైన ఏకరీత బ్యాంకును నిర్మించడానికి మార్గం కావడమే లక్ష్యం.ఏంజెల్ వన్ బ్లాగ్ ప్రకారం, బ్యాంక్ విలీనాలు మెరుగైన మూలధన బలం, పెంచిన క్రెడిట్ సామర్థ్యం, సాంకేతిక ఏకీకరణ, రిస్క్ విభజనలో మెరుగుదల, ఖర్చులను తగ్గించడం వంటి ఫలితాలను ఇస్తాయి.1993 నుండి కొన్ని ముఖ్యమైన విలీనాల్లో, ఏప్రిల్ 2017 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్లు ఎస్బిఐలో విలీనం అయ్యాయి. ఈ విలీనం తర్వాత, ఎస్బిఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa