ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో రెండు జట్లు అమ్మకానికి.. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా మార్కెట్‌లోకి?

sports |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 12:02 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ఒకటి కాదు, రెండు ఫ్రాంచైజీలు అమ్మకానికి రాబోతున్నాయని ఆయన బహిర్గతం చేశారు. ఇప్పటికే ఆర్సీబీ అమ్మకం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ రెండు జట్లనూ కొనేందుకు భారీ స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారని గోయెంకా తెలిపారు.
హర్ష్ గోయెంకా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. “ఆర్సీబీ మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి వస్తోందని నాకు తెలిసింది. ఈ రెండు ఫ్రాంచైజీలనూ సొంతం చేసుకోవడానికి నలుగురు నుంచి ఐదుగురు పెద్ద బయ్యర్లు రేసులో ఉన్నారు” అని ఆయన రాసుకొచ్చారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.
ఆసక్తికరంగా, ఈ జట్లను కొనేందుకు భారత్‌లోని పలు నగరాలతో పాటు అమెరికాకు చెందిన గ్రూపులు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ఈ రేసులో ఉన్నారని గోయెంకా పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఒక బయ్యర్ కూడా బరిలో ఉండటం ఐపీఎల్ గ్లోబల్ విలువను మరోసారి నిరూపిస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టీ ఈ రెండు జట్ల యజమాన్యం ఎవరి చేతికి వెళ్తుందనేదానిపైనే ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇంతటి భారీ బదిలీలు ఒకేసారి జరగడం అరుదు. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ డీల్స్ ఖరారు కావచ్చని, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa