డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం మహేశ్వరం, మిర్కాన్పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.ఈ రోజు మహేశ్వరంలో రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి సమిట్ నిర్వహణ కమిటీ సభ్యులు మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు./సభలో పోలీస్ శాఖకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో, అలాగే పోలీస్ శాఖ నుండి నిర్వాహకులకు ఏ విధమైన సహాయం అవసరమో చర్చించబడింది. ఈ సదస్సు కోసం సుమారు 2,500 మంది పోలీసు బలగాలు భద్రతలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సమ్మిట్ కోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్ మరియు బాంబ్ స్క్వాడ్ వంటి విభాగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయబడింది.సమిట్ కోసం అవసరమైన బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలపై కూడా అధికారులతో చర్చ జరిగింది. గ్లోబల్ సమ్మిట్లో సుమారు 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు, వీటిలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు, బహుళ సంస్థల అధినేతలు, దేశీయ పరిశ్రమల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు ఉంటారు. వీరి సహాయక సిబ్బంది సుమారు 3,000 మంది ఉంటారు.వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడుఢోరణి భద్రత ఏర్పాటు చేయబడుతుంది. సమిట్ ప్రాంతంలో అడుగడుగునా సుమారు 100 CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వీటిని సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు 1,000 ట్రాఫిక్ పోలీసులను నియమించారు. రహదారుల మళ్లింపు, రూట్ మ్యాప్లను నిర్వహించడం, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణకు ట్రాఫిక్ మార్షల్స్ నియమితులయ్యారు.సామాన్య ప్రజలు, వాహనదారులు రెండు రోజుల పాటు మార్గాల మళ్లింప్లకు సహకరించాలి. మహిళా పారిశ్రామికవేత్తలు, వక్తలు, పెట్టుబడిదారుల భద్రత కోసం విమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa