బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంత జిల్లాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.నెల్లూరు జిల్లా కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సెలవుపై ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా, అన్నమయ్య జిల్లాలోనూ విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాల వైపు వెళ్లనివ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.విశాఖ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, దిత్వా తుపాను ప్రభావంతో రాయలసీమలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అధికారిక ప్రకటనలను గమనించాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa