జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 15న గుడివాడ ముగ్గుబజార్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జేసీ నవీన్ తెలిపారు. వెనిగండ్ల ఫౌండేషన్, రెడ్సన్ ఫౌండేషన్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఈ మేళా ప్రారంభం కానుంది. పదో తరగతి నుంచి బీఫార్మసీ వరకు విద్యార్హతలు కలిగి, 18-35 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa