ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ స్టవ్ సాక్షిగా ఏడడుగులు,,,ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరమ్మాయిలు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 08:15 PM

పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే తంతు. కానీ మారుతున్న కాలంతో పాటు వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేటి కాలంలో ఒకే జెండర్‌కు చెందిన వారు వివాహాలు చేసుకుంటున్నారు. దేశంలో గత కొంత కాలంగా స్వలింగ వివాహాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇద్దరు యువతులు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.


ఈ ఇద్దరు అమ్మాయిలకు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారి తీసింది. ఈ సంఘటన మంగళవారం నాడు బిహార్‌లో వెలుగు చూసింది. సదరు యువతులు అభిరుచులు కలిశాయని, పైగా తమకు అబ్బాయిలంటే ఆసక్తి లేదని అమ్మాయిలు వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు.


బిహార్‌లోని సుపాల్ జిల్లాలో ఈ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. త్రివేణిగంజ్‌లోని ఒక మాల్‌లో పనిచేసే ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి వివరాలు ఇలా ఉన్నాయి: మధురా జిల్లాలోని ముర్లిగంజ్‌కు చెందిన సంతోష్ గుప్తా కుమార్తె పూజా గుప్తా (21). మరో యువతి పేరు కాజల్ కుమారి (18) కాగా, ఆమె శంకర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌరా బగ్లాకు చెందిన శంభు యాదవ్ కుమార్తె. ఈ వివాహంలో పూజా గుప్తా వరుడి పాత్ర పోషించగా, కాజల్ కుమారి వధువుగా వ్యవహరించింది.


సుమారు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు డిసెంబర్ 23, 2025న రాత్రి త్రివేణిగంజ్‌లోని మేళా గ్రౌండ్‌లో ఉన్న ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. అక్కడ కొద్దిమంది సమక్షంలోనే వీరి పెళ్లి వేడుక జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకలో, వీరు గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు వేశారు.


ఈ పెళ్లి గురించి మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియలేదు. పెళ్లైన మరుసటి రోజు, అంటే డిసెంబర్ 24, 2025న ఉదయం, వారు తమ అద్దె గదికి తిరిగి వచ్చినప్పుడు, ఈ వార్త చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ సందర్భంగా ఈ యువతులు మాట్లాడుతూ, తమకు పురుషులపై ఆసక్తి లేదని, తమ బంధం పూర్తిగా భావోద్వేగ అనుబంధంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ సంఘటన స్థానికుల్లో మిశ్రమ స్పందనలకు దారితీసింది. ఈ విషయం ఆ ప్రాంతంలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇక వారు గత రెండు నెలలుగా త్రివేణిగంజ్‌లోని వార్డ్ నంబర్ 18లో ఒక అద్దె గదిలో కలిసి ఉంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa