ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్డేట్ చేసిన Nokia కీప్యాడ్ ఫోన్ వచ్చేసింది – ధర ఎంతో తెలుసా?

Technology |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 08:15 PM

మొబైల్ ఫోన్లు కొత్తగా చేతిలోకి వచ్చిన రోజుల్లో Nokia ఒక సంచలనం సృష్టించింది. కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం కోసం అప్పట్లో Nokia 1100 ఫోన్‌ను ఎంతోమంది ఉపయోగించేవారు. ఆ ఫోన్ ఉన్నవారిని అప్పట్లో ప్రత్యేకంగా చూసేవారు కూడా. అయితే డిజిటల్ విప్లవంతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో కీప్యాడ్ ఫోన్లు క్రమంగా కనుమరుగయ్యాయి. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, స్మార్ట్ ఫోన్ వినియోగంపై ఆసక్తి లేని వారు ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు విస్తృతంగా వాడుతున్నా, కొందరిలో కీప్యాడ్ ఫోన్లపై మక్కువ తగ్గలేదు. ఇలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు కీప్యాడ్ మొబైల్స్‌ను కూడా ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా Nokia కంపెనీ 5G కీప్యాడ్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌ను ఆక్రమించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కీప్యాడ్ ఫోన్లకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. చాలామంది ఈ రకమైన ఫోన్లను రోజువారీ వినియోగానికి కొనసాగిస్తున్నారు. అయితే వీరిలోనూ లేటెస్ట్ ఫీచర్లతో కూడిన కొత్త మొబైల్స్‌ను కోరుకునే వారు ఉన్నారు. అలాంటి వినియోగదారులను ఆకట్టుకునేలా Nokia తాజాగా 5G కీప్యాడ్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఇది ఆపరేషన్ పరంగా కీప్యాడ్ ఫోన్‌లా ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా స్మార్ట్ ఫోన్‌కు దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 108MP కెమెరాను అందించారు. దీని ద్వారా మంచి నాణ్యత గల ఫోటోలు తీసుకోవడంతో పాటు వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం చాలా మందికి సమస్యగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కీప్యాడ్ ఫోన్‌లు బ్యాటరీ సేవ్ చేసుకునే విషయంలో మెరుగ్గా ఉంటాయి. కొత్తగా విడుదలైన Nokia 5G కీప్యాడ్ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది రోజంతా మొబైల్ ఉపయోగించే వారికి మాత్రమే కాకుండా, రెండు నుంచి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.కీప్యాడ్ ఫోన్ అయినప్పటికీ ఈ మొబైల్ డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. స్మార్ట్ ఫోన్‌ను తలపించేలా పెద్ద స్క్రీన్‌ను అందించారు. ఈ స్క్రీన్‌పై ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి యాప్స్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కీప్యాడ్ ద్వారా యాప్స్ ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఇందులో 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉండడంతో ఎక్కడ ఉన్నా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. డిస్ప్లే కూడా చూడటానికి ఆకట్టుకునేలా ఉండటంతో వీడియోలు, సినిమాలు వీక్షించవచ్చు. సాధారణంగా వెబ్‌సైట్లు బ్రౌజ్ చేసే వినియోగదారులకు ఇది సరైన ఎంపికగా ఉండే అవకాశం ఉంది. ఈ మొబైల్ ధర రూ.1,599 నుంచి ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa