ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌లో హై అలర్ట్: సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్ కనిపించారని సమాచారం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 11:00 PM

జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని ఒక స్థానిక మార్కెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా కి చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టాయి.మార్కెట్ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో ఉగ్రవాదుల అనుమానాస్పద చిత్రాలు రికార్డయ్యాయి. ఫుటేజీలో ఉన్న వ్యక్తుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్ గా గుర్తించారు. మరో వ్యక్తి హంజుల్లా అనే పాకిస్తానీ కమాండర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ వీడియో వెలుగులోకి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృత గాలింపు ఆపరేషన్లు ప్రారంభించాయి. డెంగర్ పోరా, ఖాజీబాగ్ ప్రాంతాల్లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌లు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం సేకరించడానికి స్థానిక నివాసితులను కూడా ప్రశ్నిస్తున్నారు.సీసీటీవీ ఫుటేజ్ డిసెంబర్ 25, సాయంత్రం 6.12 గంటలకు రికార్డయ్యింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహ్మద్ లతీఫ్ భట్ ఈ ఏడాది నవంబర్‌లో లష్కరే తోయిబాకు అనుబంధమైన కాశ్మీర్ రివల్యూషన్ ఆర్మీ (కేఆర్‌ఏ) లో చేరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa