మహారాష్ట్రలోని తడోబా బఫర్ జోన్లో పెద్దపులి దాడిలో ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులు ప్రేమ్సింగ్, బుదాసింగ్ అని గుర్తించారు. వీరు వెదురు సేకరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు. ఈ ఘటన తడోబా అభయారణ్యం సమీపంలో జరిగింది. పులి దాడితో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa