ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకల్ రైల్లో వలసకార్మికుడిపై వేట కొడవలితో దాడిచేసి.. విక్టరీ సింబల్‌తో యువకులు ఫోజులు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:45 PM

లోకల్ రైల్లో ఓ వలస కార్మికుడ్ని వేధించిన నలుగురు యువకులు.. అనంతరం అతడిపై కత్తితో దాడిచేసి పక్కనే నిలబడి విక్టరీ సింబల్‌తో ఫోజులిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెన్నై సమీపంలోని జరిగిన ఈ ఘటనపై తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. చెన్నై నుంచి తిరుత్తణి వెళ్లోన్న లోకల్ రైల్లో దారుణానికి పాల్పడిన నిందితులు.. తర్వాత వీరిలో ఒకరు తమిళ సినిమా పాట బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


మరో వీడియోలో, నిందితులు ఒక ఇంటి దగ్గర బాధితుడ్ని కొడవళ్లతో కొట్టడం రికార్డయ్యింది. ఆ తర్వాత దాడి చేసిన వారిలో ఒకరు బాధితుడి పక్కన 'విక్టరీ' చిహ్నంతో పోజులిచ్చాడు. ఈ దాడిలో మహారాష్ట్రకు చెందిన బాధితుడు గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నలుగురు నిందితులు వయసు 17 ఏళ్ల వయసువాళ్లేనని గుర్తించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గుర్ని చెంగల్పట్టులోని జువైనల్ హోమ్‌కు తరలించారు. నాలుగో నిందితుడికి చదువుకు ఆటంకం కలుగుతుందని భావించిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది.


ఈ వీడియో శివగంగ ఎంపీ, కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం స్పందిస్తూ.. ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన కల్పించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘నా గత డిమాండ్‌ను నేను మళ్లీ చెబుతున్నాను. తమిళనాడు పోలీసులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ‘షో ఆఫ్ ఫోర్స్’ ఆపరేషన్ అవసరం. రోడ్లపై తిరిగే అన్ని వాహనాలను భారీగా తనిఖీ చేసి, గుర్తింపు పరిశీలించాలి... హిస్టరీ ఉన్న రౌడీ షీటర్లు వారానికి మూడుసార్లు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాలి’ అని ఆయన అన్నారు.


ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. డీఎంకే ప్రభుత్వం శాంతిభద్రతలను, డ్రగ్స్‌ను నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించాయి. ‘DMK ద్రవిడ నమూనా విజయం. మైనర్లకు డ్రగ్స్ వస్తే, ఇదే జరుగుతుంది. తమిళనాడు భారతదేశంలోని కొత్త అమ్‌స్టర్‌డామ్, డ్రగ్స్ రాష్ట్రం. వీరిని మైనర్లుగా పరిగణించకూడదు.. వారిని యువకులుగానే పరిగణించాలి’ అని అన్నాడీఎంకే నేత కొవాయ్ సత్యన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa