ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము కేవలం స్నేహితులం మాత్రమే

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 03:03 PM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్, టెలివిజన్ నటి ఖుషీ ముఖర్జీ స్పష్టత ఇచ్చారు. ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ మాటలను వక్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సూర్యకుమార్ తనకు మెసేజ్‌లు చేసేవాడ‌ని, చాలామంది క్రికెటర్లు తన వెనుక పడుతున్నారని ఖుషీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ తన భార్య దేవిశాతో కలిసి తిరుమల పర్యటనలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, దీనిపై తాజాగా స్పందించిన ఖుషీ.. అప్పట్లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని, అదే గందరగోళానికి కారణమైందని పేర్కొన్నారు."మేము గతంలో స్నేహితులుగా మాత్రమే మాట్లాడుకున్నాం. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సూర్య నాతో కేవలం ఫ్రెండ్‌గా మాట్లాడాడు. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మా మధ్య అసలు సంభాషణే లేదు. ఈ వివాదం మొదలయ్యాక కూడా నేను అతడితో మాట్లాడలేదు. ఏదైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని నాకు లేదు" అని ఖుషీ స్పష్టం చేశారు. అలాగే రాబోయే ప్రపంచ కప్ కోసం సూర్యకుమార్, భారత జట్టుకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa