ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా రంగాన్ని పాకిస్తాన్ ఆయుధంగా వాడుకుంటుంది

international |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 01:07 PM

భారత్‌పై వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రతరం చేసేందుకు, రాజకీయ లక్ష్యాల సాధనకు పాకిస్థాన్ తన సినిమా రంగాన్ని ఒక సాధనంగా వాడుకుంటోందని సోమవారం ఒక నివేదిక వెల్లడించింది. కళలు, మతాన్ని ప్రభుత్వ ప్రచారానికి ఆయుధాలుగా మార్చుతూ, పవిత్ర స్థలాల గౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.‘ఖల్సా వోక్స్’ తన నివేదికలో ఈ అంశాన్ని వివరంగా ప్రస్తావించింది. భారత్‌లో ఖలిస్థాన్‌ను ప్రోత్సహించే సినిమాలు లేదా పాటలు రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు పాకిస్థాన్‌కు వెళ్లి ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంది. అక్కడ రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని తెలిపింది.పాకిస్థాన్ తన దేశీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భారత్ వ్యతిరేక కథనాన్ని నమ్ముకుంటోందని నివేదిక పేర్కొంది. ఒకవైపు భారత్, పంజాబ్ రాష్ట్రం ఆర్థిక వృద్ధి, సంస్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ పంజాబ్ అవినీతి, దుష్పరిపాలనలో కూరుకుపోయిందని వివరించింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం మద్దతిస్తున్న మీడియా, యూట్యూబర్లు, ఫిల్మ్‌ మేకర్లను రంగంలోకి దించుతోందని ఆరోపించింది.ముఖ్యంగా, గురునానక్ దేవ్ జీ జన్మస్థలమైన నన్కానా సాహిబ్ వంటి పవిత్ర సిక్కు క్షేత్రాలలో సినిమాలు చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిని సిక్కు మత పెద్దలు 'బీద్బీ' (అపవిత్రం చేయడం)గా అభివర్ణిస్తున్నారు. గురుద్వారాలు కేవలం ఆధ్యాత్మిక సాధనకు, నిస్వార్థ సేవకు మాత్రమేనని, వాణిజ్య లేదా రాజకీయ ప్రయోజనాలకు వాటిని వాడుకోవడం మత సూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తున్నారు. డబ్బు, గుర్తింపు కోసం కొందరు వ్యక్తులు మత పవిత్రతను, సమాజ గౌరవాన్ని పణంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa