వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన రాజకీయ భవిష్యత్ మొదలు.. జగన్తో తన ప్రయాణం, లిక్కర్ స్కామ్, ఆర్థిక లావాదేవీలు సహా అనేక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డిని ఈడీ విచారించింది. ఈ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.లిక్కర్ స్కామ్ కేసులో గురువారం నాడు విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు తనను అడిగిన ప్రశ్నల గురించి తెలిపారు. మొదటగా లిక్కర్ స్కామ్ జరిగిందా? లేదా? అని అడిగారని.. తనకు తెలియదని చెప్పానన్నారు. మీరు నెంబర్ 2 స్థానంలో ఉండి తెలియదు అనడం కరెక్టేనా అని అడిగారని.. జగన్ ఉన్నపుడు నెంబర్ 2 అనే ప్రసక్తే ఉండదని చెప్పానన్నారు. లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని.. తన దృష్టిలో లిక్కర్ స్కామ్ లేదన్నారు విజయసాయి. స్కామ్లో పాల్గొన్నవారినే ఈ ప్రశ్న అడగాలని ఈడీ అధికారులకు చెప్పానన్నారు. ఈడీ అధికారులు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని.. తనకు సంబంధం లేని కేసుల్లో తనను ఇరికించారని ఆరోపించారాయన. భవిష్యత్లో మరోసారి తనను పిలుస్తారని అనుకుంటున్నట్లు విజయసాయి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa