ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో తన నాలుగు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన, శుక్రవారం ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమరావతికి పయనమై, ఉదయం 11:30 గంటల నుంచి సచివాలయంలో అధికారిక విధుల్లో పాల్గొననున్నారు.ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ఫలవంతంగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేవలం మూడు రోజుల సమావేశాల ద్వారానే గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యవసాయం, టూరిజం వంటి కీలక రంగాల్లో సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని ఆయన వివరించారు. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతిని, అందుబాటులో ఉన్న వనరులను ప్రపంచ వేదికపై సమర్థంగా వివరించగలిగామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పుడు భారత్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని, దేశంలోని యువశక్తి, సమర్థ నాయకత్వం, సానుకూల పాలసీలే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa