గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. మొదటి కాన్పుకు రూ.5,000 మూడు విడతల్లో జమ అవుతుంది. గర్భధారణ రిజిస్ట్రేషన్ తర్వాత రూ.1,000, ఆరవ నెల తర్వాత రూ.2,000, శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000. అలాగే రెండో కాన్పుకు అదనంగా రూ.6,000 అందిస్తారు. దరఖాస్తు కోసం అంగన్వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, గర్భధారణ రిపోర్ట్ సమర్పించాలి. లేకపోతే అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa