ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా మరియు ఇండియా మధ్య భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

international |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 10:12 PM

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, భారత్ మధ్య నడిచే ప్రధాన రూట్లలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధ మేఘాల కారణంగా కీలకమైన గగనతల మార్గాలను మూసివేయడంతో, విమానయాన సంస్థలు తమ సర్వీసులను వేరే రూట్ల ద్వారా మళ్లిస్తుండటం, మరికొన్ని సర్వీసులను రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.సాధారణంగా అమెరికా, యూరప్, ఆసియా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. అయితే తాజా సంఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమానయాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా వరకు ఖాళీగా కనిపిస్తోంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతుండటంతో ప్రయాణ సమయం, ఖర్చు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది.గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం న్యూయార్క్, షికాగో, నెవార్క్ వంటి నగరాల నుంచి ముంబై, న్యూఢిల్లీలకు వచ్చే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్  నుంచి న్యూఢిల్లీకి వచ్చే విమానాల్లో టికెట్ ధరలు ప్రస్తుతం రూ. 1.34 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు పలుకుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి రూ. 45 వేల నుంచి రూ. 1 లక్ష మధ్య ఉంటాయి. అంటే 100 శాతానికి పైగా ధరలు పెరిగాయి.షికాగో నుంచి వచ్చే విమానాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. షికాగో - ముంబై రూట్‌లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి, రూ. 1.9 లక్షల నుంచి రూ. 2.8 లక్షల వరకు చేరాయి. సాధారణంగా ఈ రూట్‌లో రూ. 45 వేల నుంచి రూ. 75 వేలకే టికెట్లు లభిస్తాయి. అలాగే నెవార్క్ - ముంబై, షికాగో - ఢిల్లీ రూట్లలో కూడా టికెట్ ధరలు రెట్టింపు అవ్వడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa