ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి రూ.94.80 లక్షల బంగారు పతకాల విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2026, 03:09 PM

AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాముల 7 బంగారు పతకాలను శుక్రవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ గీతిక సాయి, ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 చొప్పున మొత్తం రూ.20,02,232 విరాళంగా అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa