ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలిస్తాం : మంత్రి బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 10:34 PM

రాజధాని ప్రాంతం మొత్తం అవినీతి కూపంలా ఉంద‌ని, అమరావతిలో ఏది ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోంద‌ని అన్నారు మంత్రి బొత్స .  సీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్ప‌టికే  రాజధాని వ్యవహారాలను  మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని, ఇంత‌వ‌ర‌కు చూసిన వ్య‌వ‌హారంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయ‌నిగుర్తించిన‌ట్టు చెప్పారు.  అందుకే టీడీపీ హయాంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమం పైన లోతుగా విచారణ జరుపుతున్నామ‌ని,   తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాంమ‌న్నారు.   రాజధాని వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్ణయిస్తాం  ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పారు బొత్స‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa