ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని గురువారం ప్రకటించింది. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తామన్న హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. దీనిని ప్రభుత్వ, ప్రాధమిక, మధ్యమ, ఉన్నత పాఠశాలలకే పరమితమని ప్రకటించింది. అయితే విమర్శలు రావటంతో దీనిని ప్రయివేటు పాఠశాలలకు వి్తరించింది. తాజాగా సీఎం జగన్ ఈ పథకాన్ని ఇంర్మీడియట్ విద్యార్థులకు అమ్మవడి వర్తింపజేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ప్రయోజనాలు ఉంటాయని ప్రకటించింది. కాగా ఇందుకు సంబంధించి నిధుల కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రశ్నార్ధకంగా మారిందన్నది అధికారవర్గాలలో గుసగుస. మరోవైపు ఇప్పటి వరకు విద్యార్ధులకు ఇస్తున్న స్కాలర్షిప్లని తగ్గించేందుకు యోచన ఆరంభమైందన్న వాదనలూ వినవస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa