అందరికి తాగునీరు అందించేందుకు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాం అని మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని ఉర్మిలా నగర్, బ్రహ్మం గారి కాలనీ, జోజి నగర తదితర ప్రాంతాలలో మున్సిపల్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన సందర్భంలో తాగునీరు కు ఇబ్బంది పడుతున్నమని చినుకు పడితే బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎన్నో ఏళ్ళుగా డ్రైనేజీ మురుగు సమస్య పరిష్కారం కావటం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే లు, ఎంపి కు . టిడిపి ప్రజా ప్రతినిధులకు అభివృద్ధిపై కన్నా వై యస్ ఆర్ సిపి నాయకులు, జగన్ పై విమర్శలు చేయటానికి సమయం సరిపోయిందన్నారు. నగరంలో వర్షపు నీరు పారుదల కు, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా భవానిపురం 28 వ డివిజన్లో దర్గా ఆస్తుల పరిరక్షణపై స్థానిక నేతలు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ, దర్గా ఆస్తులు ఆక్రమించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, దర్గా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa