ఆలయ నిర్మాణ వైశిష్ట్యంపై దాతలకు అవగాహన కల్పించేందుకు వీలుగా 2, 3 నిమిషాల వ్యవధితో కూడిన వీడియోలు రూపొందించి టిటిడి వెబ్సైట్లో ఉంచాలని, తద్వారా శ్రీవాణి(శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం) ట్రస్టుకు విరాళాలందించేందుకు ఎక్కువ మంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో గురువారం ఐటి విభాగంపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి వెబ్సైట్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటున్న భక్తులు శ్రీవాణి ట్రస్టుకు కొంతమేరకు ఆన్లైన్లో విరాళాలందిస్తున్నారని, వీటిని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. శ్రీవారి సేవ నెక్ట్స్ జనరేషన్ అప్లికేషన్ను సెప్టెంబరు నాటికల్లా పూర్తి చేయాలని, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి సేవకులు సులభంగా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఈ అప్లకేషన్ పై విభాగాల వారీగా సంబంధిత అధికారులకు అవగాహన కల్పించాలని ఐటి అధికారులను కోరారు. ఇప్పటికే అన్నదానం, భద్రత, కల్యాణకట్ట, రిసెప్షన్ తదితర విభాగాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులకు ఆన్లైన్లో ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించినట్టు చెప్పారు.
గోవింద మొబైల్ యాప్ ద్వారా శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకునే సమయంలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన టోకెన్లు పొందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అవసరమైన తనిఖీలు చేపట్టాలని తిరుపతి జెఈవోను కోరారు. టిటిడి ప్రచురణలు, బంగారు డాలర్ల విక్రయం, పలు రకాల వస్తువుల వేలం తదితరాలకు సంబంధించిన సేల్స్ అప్లికేషన్, ప్రాపర్టీస్ విభాగంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్లను తరచుగా పరిశీలించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa