చంద్రబాబుకు అద్దెకు ఇచ్చినందుకు నన్ను బినామీ అంటారా? అంటూ సీఎం జగన్కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్ లేఖ రాశారు. మంగళవారం ఆయన ఈ లేఖను పంపిస్తూ దానిలో అనేక అంశాలు ప్రస్తావించారు. తన నివాసానికి ఉండవల్లి పంచాయతీ, కృష్ణా సెంట్రల్ డివిజన్ ఏఈ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకున్నానని, వీటిని వైఎస్ హయాంలోనే మంజూరు చేసిన విషయం ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. ఇటీవల ఏర్పడిన సీఆర్డీఏ తమ నుంచి అనుమతులు పొందలేదంటూ ఎప్పుడో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామనటం తనని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలంగా ఉంటుందని అప్పటి అధికారులు కోరితే తన అతిథి గృహాన్ని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. తన నిర్ణయం వెనుక రాజకీయ, ఆర్ధిక ప్రతిపాదనలు లేవని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రం విడిపోయాక ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...ఎవరు సీఎంగా ఉన్నా...తను ఇలాగే స్పందించేవాడినని లేఖలో లింగమనేని రమేష్ తేల్చి చెప్పారు. ‘నా ఆస్తులపై విచారణ జరపాలని మీరు ఆదేశించినట్టు తెలిసిందని, కొత్తగా నేను మీకు తెలియజేయాల్సింది..నేను దాచిపెట్టింది ఏమీలేదు’’ అని లింగమనేని రమేష్ జగన్కు చెప్పారు.
అప్పటి సీఎంకు ఇంటిని అద్దెకు ఇచ్చినందున నేను ఆయనకు బినామీనని అవాస్తవాలు ప్రచురించి తనని ఆవేదనకు గురిచేశారని. అధికారంలోకి వచ్చాక సమైక్య ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులు చెల్లవని చెపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు కరకట్ట వెంబడి మొదలైన కూల్చివేతలు తమ ప్రాంతానికి కూడా వస్తాయని అందరూ భయపడుతున్నారని లింగమనేని తన లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa