ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల గృహాలను కొల్లగొడతారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 08:57 PM

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల గృహాలను కొల్లగొడతారా? అని మండిపడ్డారు. హైదరాబాదు లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో మీ భవనాన్ని క్రమబద్ధీకరించిన సంగతిని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో మీకు ఉన్న 618 ఎకరాల అసైన్డ్ భూములును క్రమబద్ధీకరించుకున్న సంగతి గుర్తులేదా? అని అడిగారు. ఇప్పుడు వైసీపీలో చేరకుండా ఉన్న వారి ఇళ్లన్నీ అక్రమకట్టడాలు అయిపోతాయా? అని మండిపడ్డారు. ఇదేమైనా పులివెందుల పంచాయతీనా లేక పరిపాలనా? అని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa