ప్రభుత్వం నియమించిన వలంటీర్ ఉద్యోగాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లతో పెద్ద ప్రమాదం వచ్చి పడిందన్నారు. ఓ అమ్మాయిని వాంఛ తీర్చమని వలంటీర్ వేధించాడన్నారు. దానికి ఒక అమ్మాయి ద్వారా సంప్రదింపులు జరిపి.. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ వలంటీర్ ఆమెపై దాడి చేశాడన్నారు. ఆ అవమానం భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెన్ని చూడాలో అర్థం కావట్లేదన్నారు. వలంటీర్ ఉద్యోగం మీ కార్యకర్తలకు ఇవ్వమని అసలు ఎవరడిగారని జగన్ను సూటిగా ప్రశ్నించారు. అయినా ఆ ఉద్యోగంతో ఏం లాభమని నిలదీశారు.
రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి వలంటీర్ జాబ్ అంటారా? అని దుయ్యబట్టారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి.. తామేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా కథలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పైగా వలంటీర్లేమో ఇలాంటి అకృత్యాలు చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేయడం, మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులు ఎంత నీచమన్నారు. వీటిని చూస్తుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఆవేదన, ఆవేశం వస్తుందన్నారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే... ఒక్కరైనా స్పందించారా?, ప్రాణమంటే లెక్కలేదా? అని ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa