పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే రాజకీయ సవాళ్లకు సమర్థంగా సిద్ధమవడమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని వాసర్ల గార్డెన్స్లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ హాజరై జిల్లా పార్టీ నాయకులకు సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గంలో కమిటీల నియామకాలకు సంబంధించి చేపడుతున్న ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. పార్టీ నిర్మాణం వ్యవస్థబద్ధంగా, పారదర్శకంగా జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa