ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫసల్‌ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలిగించడం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:14 AM

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రైతులను పంటల బీమా పరిధిలోకి రాకుండా చంద్రబాబు ప్రభు­త్వం దగా చేసిందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు రామారావు (బాబి) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమలాపురంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో ఆయ‌న వైయస్‌ఆర్‌సీపీ నాయ‌కుల‌తో క‌లసి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్ర‌భుత్వ నిర్వాకాల ఫలితంగా.. రుణాలు పొందని రైతులే కాదు, రుణాలు తీసుకునేవారు కూడా పంటలకు ప్రీమియం చెల్లించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆక్షేపించారు. కూట‌మి ప్రభుత్వం ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగా ప్రస్తుతం రబీ సీజన్‌లో కనీసం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కూడా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకు రాలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో ఫసల్‌ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగించారన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను ఎగరగొట్టిన చంద్రబాబు ప్ర‌భుత్వం.. ఏడాది తిరగకుండానే ’స్వచ్ఛంద పంటల బీమా’ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చ‌ర్య‌ల కార‌ణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అంద‌కుండా పోయింద‌ని వివ‌రించారు. దీంతోపాటు కరువు బకాయిలతో క‌లిపి 19 నెలల్లో రూ.1,100 కోట్లకు పైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగనామం పెట్టిందని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa