కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ కె.ఆర్. రమేష్కుమార్ 15 మంది ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత వేటుపై సుప్రీమ్ కోర్టు లో దాఖలైన పిటిషన్లపై తుది నిర్ణయం ప్రకటించే వరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఇసి పేర్కొంది.
కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 22కు వాయిదా పడింది. వాస్తవానికి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్నాటక ఉపఎన్నికలను కూడా ఒకే దశలో నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అక్టోబర్ 21 జరిగే ఉపఎన్నికలపై స్టే విధించాలని లేదా తమను ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని కోరుతూ అనర్హతకు గురైన కర్నాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా పడటంతో మరోసారి రాష్ట్ర రాజకీయం ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa