ముఖ్యమంత్రి జగన్ తన బరువుకు సమానంగా 80 కిలోల బియ్యంతో తులాభారం తూగి దానిని మొక్కు గా వెంకన్నకు సమర్పించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమవారం రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అంతకు ముందు శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్ కలిసి స్వాగతం పలికారు.
ఆ తరువాత సిఎం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, సివిఎస్వో గోపినాథ్జెట్టి, అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తదితరులు పాల్గొన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa