దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మరణిం చారని అధికారిక వర్గాల అంచనా. ముఖ్యంగా బీహార్, యూపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలలో వీరి సంఖ్య అధికంగా ఉందని తెలియవచ్చింది. ఈ రాష్ట్రాలలోని. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫర నిలిచిపోగా, రహదారులు దెబ్బతిన్నాయి. మరోవైపు అనేక రైళ్లను రద్దు చేశారు. వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముంపుకు గురైన ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చాయి. యూపీలో మొత్తం 96 మంది మృతి చెందారు. . బీహార్ వర్షాలకు గత రెండు రోజుల్లో 31 మంది కన్నుమూసారు. పట్నా నగరం చెరువును తలపిస్తోంది. ప్రముఖులు ఉండే రాజేంద్ర నగర్, పాటలీ పుత్ర ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఆస్పత్రుల్లో వర్షపు నీరు చేరడంతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. అనే క చోట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు నీట మునిగాయి. సుమారు 30 రైళ్లను రద్దు చేశారు. మధ్యప్రదేశ్ శివోని జిల్లాలో చెరువులోకి ఒక పోలీసుజవాను మరో ఇద్దరు కొట్టుకు పోయి మృతి చెందారు.ఈ కాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే దాదాపు 17 వందల శాతం వర్షాలు ఎక్కు వ పడ్డాయని నిపుణులన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa