ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుతుపవనాలు రికార్డులను సృష్టించాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 08:36 AM

ఈ ఏడాది రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), స్కైమేట్‌ వంటి ప్రైవేటు సంస్థల అంచనాలు తప్పాయి. అంతకు మించి వర్షాలు కురిశాయి. రుతుపవనాలు రికార్డులను సృష్టించాయి. నైరుతిపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే ఆందోళన తొలినాళ్లలో తీవ్రంగా వ్యక్తమైంది. రుతుపవనాల ఆగమనం జూన్‌ 1న కాకుండా 8న జరిగింది. జూన్‌లో సాధారణం కంటే 30ు లోటు వర్షపాతం నమోదు కాగా.. ఇదేసమయంలో ఎండలు, వడగాడ్పులు కొనసాగాయి. జూలై చివరివారానికల్లా రుతుపవనాలు పుంజుకున్నాయి. దేశంలో కొద్దిప్రాంతాలు తప్ప మిగిలినచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. మొత్తంమీద. మిగులు వర్షపాతంతో సీజన్‌ ముగిసింది.


ఇవీ రికార్డులు..


ఈ ఏడాది నైరుతిలో 110 వర్షపాతం నమోదైంది. 1994 తర్వాత సాధారణాన్ని మించి వర్షం పడటం ఇదే తొలిసారి సోమవారంతోనే రుతుపవనాలు తిరోగమనమవ్వాలి. కానీ.. ఇంకా చురుగ్గా ఉన్నాయి. ఈ నెల 10 నుంచి తిరోగమనం మొదలవ్వొచ్చు. నైరుతి తిరోగమనం ఇన్ని రోజులు ఆలస్యమవ్వడం కూడా ఒక రికార్డే ఈ సారి ఆగస్టు-సెప్టెంబరు మధ్యకాలంలో అధికవర్షపాతం కురుసింది. ఈ సీజన్‌లో 130ు వర్షం కురిసింది. మూడు దశాబ్దాల్లో ఇదే అత్యధికం కాగా.. 1983లో ఇది 142 గా నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa