ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనం. రూ.75 ప్లాన్లో జియో నుంచి జియోకు అపరమిత కాల్స్ సౌకర్యం ఉండగా, జియో యేతర నెట్వర్క్లకు 500 నిమిషాల ఉచిత కాల్స్ కేటాయించింది. 50 ఎస్సెమ్మెస్లు, నెలకు 3జీబీ డేటా లభిస్తుంది. రూ.125 ప్లాన్లో నెలకు 14జీబీ డేటా, 500 నాన్-జియో నిమిషాలు, 300 ఎస్సెమ్మెస్లు లభించనుండగా, రూ.155 ప్లాన్లో 28 జీబీ, 500 నాన్ జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
రూ.185 ప్లాన్లో 56 జీబీ నెలవారీ డేటా, 500 నాన్-జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. అన్ని ప్లాన్లకు కాలపరిమితి 28 రోజులు. కాగా, జియో ఇటీవల తమ రెగ్యులర్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం ‘ఆల్-ఇన్-వన్’ ప్లాన్లు ప్రకటించింది. ఇందులో రూ.225, రూ.555 ప్లాన్లు ఉన్నాయి. వీటిలో రోజుకు 2జీబీ డేటా, 3,000 నాన్-జియో వాయిస్ కాలింగ్ మినిట్స్ లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa